Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురి పరిస్థితి విషమం
- యూపీలో విషాదం
లక్నో: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న మద్యం దుకాణంలో నుంచి తీసుకొచ్చిన కల్తీ కల్లు తాగి పది మంది మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కాన్పూర్ దెహట్కు చెందిన కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ మద్యం దుకాణంలోని కల్లును తెచ్చుకున్నారు. అది తాగి అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిని తీసుకెళ్లేసరికే పదిమంది మరణించారు. ఈ ఘటనలో మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి కాన్పూర్లోని లాలా లజపతిరారు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమరత్రి యోగీ ఆదిత్యనాథ్ రూ. 2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. ఎక్సైజ్ శాఖ ఎస్సైని సస్పెండ్ చేసిన అధికారులు.. మద్యం శాంపిళ్లను ల్యాబ్కు పంపారు. ఘటనతో సంబంధమున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మద్యం షాపు యజమాని పరారీలో ఉన్నాడు. కాగా, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు మృత దేహాలతో ధర్నాకు దిగారు.