Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత సైన్యాన్ని ప్రాధేయపడిన పాక్ రేంజర్లు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా కాల్పులను ఆపాలని పాక్ సైన్యం.. భారత సరిహద్దు భద్రతా సిబ్బంది(బీఎస్ఎఫ్)ని ఆదివారం ప్రాధేయపడింది. పాక్ నిష్కారణదాడులకు, కాల్పులకు సమాధానంగా గతమూడు రోజుల నుంచి అంతర్జాతీయ సరిహద్దు గుండా పాకిస్థాన్ ఫైరింగ్ స్థావరాల పై భారత సైన్యం కాల్పులు జరుపుతోంది. ఇది పాకిస్థాన్ సైన్యానికి తీరని నష్టాన్ని కలిగించింది. దీంతో బేంబెలెత్తిన పాక్ సైన్యం.. అంతర్జాతీయ సరిహద్దు, తీర నియంత్రణ రేఖ గుండా కాల్పులు ఆపాలని తమను ప్రాధేయపడినట్టు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జమ్మూలో ప్రధాని పర్యటనకు ఒక్కరోజు ముందు పాక్ దళాలు శుక్రవారం జరిపిన కాల్పుల్లో ఒక జవాను సహా, నలుగురు పౌరులు మృతి చెందారు. దీంతో భారత సైన్యం పాక్కు శనివారం తగిన సమాధానమిచ్చింది. అంతర్జాతీయ సరిహద్దుగుండా ఉన్న పాక్ బంకర్లను పేల్చేసింది. ఇది పాక్ సైన్యానికి తీరని నష్టాన్ని కలిగించింది. దీంతో దిగివచ్చిన పాక్ సైన్యం.. సరిహద్దు గుండా కాల్పులు ఆపాలని భారత సైన్యాన్ని కోరింది.