Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 గ్రామాలకు కరెంటు నిలిపివేత
భోపాల్: మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్ సురక్షిత ల్యాండింగ్ కోసం ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు అక్కడి 20 గ్రామాలకు కరెంట్ను నిలిపివేసింది. విద్యుత్ సరఫరా కార్యాలయం వద్ద స్థానికుల ఆందోళన చేపట్టగా 12 గంటల తర్వాత కరెంట్ను పునరుద్ధరించారు. రాజ్నాథ్ చాపర్ సురక్షితంగా ల్యాండింగ్ కోసమని..శనివారం సాయంత్రం 4 గంటలనుంచి ఆదివారం 6గంటల వరకు విద్యుత్ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం నోటీసు విడుదల చేసింది. 'నీరు లేదు, కరెంటు లేదు..ఏం చేయాలో తెలియట్లేద'ని కరెంటు పునరుద్ధరణకు ముందు స్థానికులు వాపోయారు. అక్కడి కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడగా వారు నిస్సహాయతను వ్యక్తపరిచారని చెప్పారు. 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఠాకూర్ రామ్నాథ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆదివారం నాడు హోం మంత్రి వెళ్లనున్నారు