Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవాడ సదస్సులో వక్తలు
- అశ్లీల సైట్లు నిషేధించాలని డిమాండ్
- పాఠ్యాంశంగా లైంగికవిద్య చేర్చాలని తీర్మానం
అమరావతి: మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అన్ని సంఘాలూ ఐక్యంగా పోరాడాలని మహిళా సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఆదివారం విజయవాడ ఎంబి విజ్ఞానకేంద్రంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో ' మహిళలపై హింస, అత్యాచారాలను అరికట్టేదెలా?' అనే అంశంపై పలువురు వక్తలు మాట్లాడారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి ప్రారంభించిన ఈ సదస్సుకు పిఒడబ్ల్యూ నాయకులు సంధ్యా భవాని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళలకు రాజకీయ, సామాజిక సమానత్వం ఉండేలా పలు అంశాలను తీర్మానించారు. ఈ మేరకు ఎపిడబ్ల్యుజెఎఫ్ ప్రతినిధి శాంతిశ్రీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సులో ఆమోదించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ అభివృద్ధి జరుగుతున్న సందర్భంలోనే మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయన్నారు. దీనిని రాజకీయ, సామాజిక సమస్యగా గుర్తించడంలేదని, ఈ సమస్యపై మగవారిలోనూ చర్చ జరగాలని సూచించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఉండాలనే చట్టాన్ని ప్రభుత్వాలు, మహిళల కోసం తీసుకొచ్చిన చట్టాలను రాజకీయ పార్టీలు మరిచిపోయాయని ఎద్దేవా చేశారు. కులమతాల విద్వేషాలు, ప్రతీకారం కోసం చిన్నారులు, ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడు తున్నారని చెప్పారు. మహిళలు ఇలాంటి ఘటనలకు గురికాకుండా, ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తులుగా మారాలన్నారు. నిర్భయంగా తిరిగే హక్కు ఆడవారికి ఉందని, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. హింసకు ఎదురుగా విల్లు ఎక్కుపెట్టి ప్రతి ఒక్క మహిళా పోరాడాలని పిలుపునిచ్చారు. దీనిపై సమాజంలో లోతుగా సిద్ధాంతపరమైన అవగాహన వచ్చేవరకూ పోరాడాలన్నారు. ఐద్వా ఆలిండియా ఉపాధ్యక్షులు పుణ్యవతి మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారే స్త్రీలను గౌరవించడంలేదన్నారు. కథువా, ఉన్నావో వంటి ఘటనల్లో అధికార పార్టీ నాయకులే నేరస్థులకు అండగా నిలిచారని మండిపడ్డారు. చిన్నారులపై జరిగే అత్యాచారాలు, లైంగిక వేధింపులకు సంబంధించి ఢిల్లీలో మహిళా సంఘాలు చేసిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసేవారిలో 14 శాతం తండ్రులు, 39 శాతం వారి బంధువులు, 10 శాతం టీచర్లు, 14 శాతం ఇరుగుపొరుగువారు, 4 శాతం కేర్ టేకర్లు, 4 శాతం మతపెద్దలు, 1 శాతం తెలియని వారున్నట్లు వెల్లడయ్యిందన్నారు. ఇంట్లో వారే దాడులకు పాల్పడుతుంటే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ఆ కుటుంబంలోని వారు సాహసిం చడంలేదన్నారు. లైంగిక వేధింపులను నియంత్రిం చేందుకు జస్టిస్ వర్మ కమిటీ సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇలాంటి కేసులు నమోదు చేసుకునేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మహిళా పోలీసులుండాలన్నారు. మహిళలపై హింసను, వేధింపులను అరికట్టేందుకు సమాజంలో మార్పు రావాలని, అందుకు అన్ని ప్రాంతాల్లోనూ బహిరంగ చర్చ పెట్టాలని, మగవారు కూడా అందులో పాల్గొనాలన్నారు. ఈ సమస్యపై ప్రశ్నించాలని, విస్తృతంగా చర్చలు జరగాలన్నారు. మహిళల్ని అవమానించినవారు అధికారంలో ఉన్నా, ఎంతటివారైనా క్షమాపణలు చెప్పే దిశగా మార్పు రావాలన్నారు.
వ్యసనాలను నిషేధించాలి :
రాధిక, మానసిక వైద్యులు
మరో ముఖ్య అతిధి మానసిక వైద్యులు రాధిక మాట్లాడుతూ ఆల్కహాలు, డ్రగ్స్, పోర్న్సైట్లు చూడటం వంటి వ్యసనాలున్నవారే ఎక్కువగా మహిళలు, చిన్నారులపై అఘా యిత్యాలకు పాల్పడుతు న్నారన్నారు. సైకో మనస్తత్వం ఉన్న వారి మానసిక పరిస్థితి హింసను ప్రేరేపించేలా ఉంటుందన్నారు. చిన్న చిన్న ప్రవర్తనల ద్వారా వారిని గుర్తించాలన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాల ప్రభావం వల్ల పెద్దయ్యాక కూడా జీవితాంతం వారు ఏదో ఒక మానసిక వ్యాధికి గురవుతున్నారని వివరిం చారు.