Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజనీకాంత్
చెన్నై: బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజుల గడువు ఇచ్చి కర్నాటక గవర్నర్ వాజూభారు వాలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రజనీకాంత్ అన్నారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ... కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అడ్డదారులు తొక్కి బీజేపీ అధికారంలోకి రావాలని చూసిందని.. కానీ, చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. గవర్నర్ తీరు సరికాదన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తీర్పు వెలువరించినందుకు హర్షం వ్యక్తం చేశారు. 2019లో జరుగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. దానికింకా సమయముందని, ఎన్నికల తేదీ విడుదలయ్యాక దాని గురించి మాట్లాడతానన్నారు. తమ పార్టీ ఇంకా ప్రారంభం కానప్పటికీ అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కమల్హసన్తో పొత్తుపై స్పందిస్తూ.. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడలేమన్నారు. కావేరి జలాల బోర్డు కర్నాటక ఆధీనంలో కాకుండా సీనియర్ ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుందని రజనీ అన్నారు.