Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజా రాజకీయాలపై చర్చ
కొచ్చి: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) అధినేత కమల్హాసన్.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కొచ్చిలో ఆదివారం కలిశారు. కర్నాటకలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దేశంలోని తాజా రాజకీయాల పై వారు చర్చించుకున్నట్టు సమాచారం. సుమారు 40 నిమిషాల పాటు బోల్గట్టి భవనంలో జరిగిన విందు సమావేశంలో సీపీఐ(ఎం)కేరళ సచివాలయ సభ్యులు పి. రాజీవ్ కూడా పాల్గొన్నారు. బీజేపీని ఎదుర్కొవడానికి సెక్యులర్ పార్టీలు చేతులు కలపాలని సమావేశంలో చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోయంబత్తూరులో జూన్లో తమ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించడానికి సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడిని కలిసినట్టు సమావేశానంతరం కమల్ తెలిపారు. సీఎం విజయన్ అందుబాటును బట్టి కార్యక్రమానికి ప్రణాళిక చేయనున్నట్టు వివ రించారు. రాష్ట్రంలో రెండేడ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఫ్ కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.