Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
భోపాల్: గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న గోరక్షకులు ఆదివారం మళ్లీ రెచ్చిపోయారు. ఆవు మాంసాన్ని తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ముస్లిం వ్యక్తిపై గోరక్షకులు కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సత్నా జిల్లా అగ్మర్ గ్రామానికి చెందిన రియాజ్ (45) అనే వ్యక్తి ఆవులను చంపుతున్నాడని అతడిపై గోరక్షకులు మారణాయుధాలతో దాడికి దిగారు. రియాజ్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన దగ్గర డ్రైవర్గా పని చేస్తోన్న షకీల్ (33)కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని జబల్పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు గోరక్షకులను పోలీసులు అరెస్టు చేశారు.