Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హర్యానాలోని హిసార్కు చెందిన బాలిక శివంగి పథక్(16) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. పిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించిన ఆమె రికార్డుల్లోకెక్కారు. శివంగి పథక్ సాధించిన ఘనత పై ప్రధాని మోడీ ప్రశంసలు కురింపించారు. ఆమెకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈనెల 16న మహారాష్ట్రకు చెందిన నలుగురు గిరిజన విద్యార్థులు ఎవరెస్టును అధిరోహించిన విషయం తెలిసిందే. వీరిలో ఉమాకాంత్ మాధవి(18), పరమేశ్ ఆలె(19), మనీషా ధుర్వే(18), కవిదాస్ కఠ్మోడే(18) ఉన్నారు. అయితే, శివంగి పథక్ మాత్రం 16 ఏండ్ల వయస్సులోనే ఈ ఘనతను సాధించింది.