Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్: బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి మొదటి పరీక్షను భారత్ సోమవారం విజయవంతంగా నిర్వహించింది. క్షిపణి జీవితకాలాన్ని 10 నుంచి 15 ఏండ్లకు పెంచాలనే లక్ష్యంతో పరీక్షను జరిపారు. ఒడిషాతీరం గుండా ఉన్న ఛాందీపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి ఉదయం 10.44 గంటలకు క్షిపణిని పరీక్షించినట్టు డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి. క్రూయిజ్ క్షిపణిని ప్రయోగం విజయవంతం కావడం పై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బ్రహ్మోస్ బృందానికి, డీఆర్డీఓకు అభినందనలు తెలిపారు. జీవితకాలాన్ని 10 నుంచి 15 ఏండ్లకు పెంచిన తొలి భారతీయ క్షిపణి బ్రహ్మోస్ కావడం విశేషం. కాగా, ఇప్పటికే భారత సైన్యం అమ్ముల పొదిలో బ్రహ్మోస్కు చెందిన మూడు దళాలు ఉన్నాయి.