Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మంది మృతి
అగర్తలా: నాలుగు రోజులుగా త్రిపురలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సాధారణ జన జీవనాన్ని అస్త వ్యస్తం చేస్తున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షా నికి రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. వరదల ధాటికి గోమతి, ఖోవాయి, సిఫాయిజలా, పశ్చిమ త్రిపుర జిల్లాల్లోని గ్రామాలు డ్యాంలను తలపిస్తున్నాయి. వరదల కారణంగా దాదాపు 13 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరినీ సహాయక శిబిరాలకు తరలించారు. సోమవారం వరద ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రతన్లాల్ నాథ్.. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ, అగ్ని మాపక సిబ్బంది, పౌరసరఫరాల విభాగాలు బాధితులకు సహాయం అందిస్తున్నాయన్నారు.