Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కథువా కేసులో ఫోరెన్సిక్ నివేదికలో తేలిన నిజం
శ్రీనగర్ : కథువాలో ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి, ఆ తర్వాత హత్యకు పాల్పడిన ఘటనలో నిందితుల్లో ఒకడి బాగోతాన్ని ఫోరెన్సిక్ నిపుణులు బయటపెట్టారు. ఈ కేసులో నిందితుడైన కళాశాల విద్యార్థి విషాల్ జంగోత్ర కేసు నుంచి తప్పించుకునేందుకు చేసిన కుట్రను భగం చేశారు. సంఘటన జరిగిన రోజు తాను మీరట్లోని యూనివర్సిటీ కళాశాలలో పరీక్షకు హాజరయ్యానని చెబుతుండగా.. ఆ పత్రాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. విషాల్ జంగోత్ర అసలు సంతకంతో పరీక్ష అటెండెన్స్ షీటులోని సంతకం సరిపోలేదు. అది ఫోర్జరీ సంతకమని తేలింది. జనవరి 15వ తేదీన జరిగిన పరీక్షకు విషాల్ తనకు బదులుగా స్నేహితుడిని పంపించి రాయించాడని తేలింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ క్రైం బ్రాంచ్కి సెంట్రల్ పోరెన్సిక్ సైన్సెస్ లేబరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఫోరెన్సిక్ అధికారులు నివేదిక సమర్పించారు.
దీంతో పరీక్ష సంతకం ఫోర్జరీ వ్యవహారంలో విషాల్ ముగ్గురు స్నేహితులకు విచారణాధికారులు సమన్లు జారీ చేశారు. కథువాలో ఎనిమిదేండ్ల బాలికపై హత్యాచార ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిదిమందిలో విషాల్ జంగోత్ర ఒకడు. ఘటన జరిగినప్పుడు అంటే జనవరి 15న తాను మీరట్లో ఉన్నాననీ, మీరట్లోని యూనివర్సిటీ కళాశాలలో పరీక్షకు హాజరయ్యానని తొలుత పోలీసు విచారణలో విషాల్ చెప్పాడు. దీంతో ఆ పరీక్ష పత్రాలను తెప్పించిన దర్యాప్తు అధికారులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడంతో అసలు బండారం బట్టబయలైంది.