Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష రూపాయల చొప్పున జరిమానా
న్యూఢిల్లీ: లైంగికదాడి వీడియోల విషయంలో తీసుకుంటున్న చర్యల పై సమాధానం ఇవ్వవడంలో విఫలమైనందకు ఇంటర్నెట్ దిగ్గజాల పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్, ఫేస్బుక్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలకు సుప్రీంకోర్టు లక్షరూపాయల చొప్పున జరిమానాను విధించింది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే ప్రజ్వల ఎన్జీవో.. సామాజిక మాధ్యమాల్లో లైంగికదాడి వీడియోల పై ఆందోళన వ్యక్తం చేస్తూ 2015లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి హె.ఎల్. దత్తుకు లేఖరాసింది. అప్పటి నుంచి న్యాయస్థానం ఈ లేఖ పై వాదనలు వింటూ వస్తోంది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం.. సామాజిక మాధ్యమాలు యాహు, ఫేస్బుక్ ఐర్లాండ్, ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియా, గూగుల్ ఐఎన్సీ, మైక్రోసాఫ్ట్, వాట్సాప్లకు గతంలో ప్రత్యేకంగా ఆదేశించినప్పటికీ ఆ సంస్థలు తీసుకుంటున్న చర్యల పై సరైన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యాయని న్యాయమూర్తులు మదన్ బి లోకూర్, యు యు లలిత్లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలను తొలగించే విషయంలో తీసుకుంటున్న చర్యల పై జూన్ 15లోగా అఫిడవిట్ను దాఖలు చేయాలని సామాజిక మాధ్యమాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సైబర్ నేరాలను నివేదించే బెటా వర్షన్ను జులై15లోగా ప్రారంభిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.