Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దులో మళ్లీ కాల్పులు
- ఇద్దరికి గాయాలు
శ్రీనగర్: రెండు రోజుల క్రితం బీఎస్ఎఫ్ దళాలు జరిపిన మెరుపు దాడికి కాళ్లబేరానికి వచ్చిన పాక్ ఆర్మీ తీరు మారలేదు. ఎప్పటిలాగే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూకాశ్మీర్లోని అర్నియా జిల్లాలో కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి పది గంటల నుంచి ప్రారంభమైన కాల్పులు సోమవారం సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవిచలేదని బీఎస్ఎఫ్ అధికారులు తెలియజేశారు. కాల్పులు జరిపిన 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలన్నింటికీ సెలవు ప్రకటించారు. అక్కడి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
పోలీసుల శిభిరంపై మిలిటెంట్ల దాడి
పూల్వామాలోని ఓ పోలీస్ శిబిరంపై మిలిటెంట్లు దాడి చేశారు. జిల్లాలోని తనాబ్ ప్రాంతంలో ఉన్న పోలీసుల శిబిరంపై మిలిటెంట్లు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాడిని తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపారు. మిలిటెంట్లు.. శిబిరంలో ఉన్న ఆయుధాలను దొంగిలించడానికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.