Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ ఎక్స్ప్రెస్లో మంటలు
- రెండు కోచ్లు పూర్తిగా దగ్ధొంప్రయాణికులు సురక్షితం
- మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో ఘటన
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీ ఏసీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చేలరేగాయి. మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలోని బిర్లా రైల్వేస్టేషస్కు రైలు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో బీ-6, బీ-7 రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బోగీల్లో పొగలు వ్యాపించగానే ప్రయా ణికులు అప్రమ త్తమై దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే కోచ్లో 37 మంది డిప్యూటీ కలెక్టర్లు ప్రయా ణిస్తున్నారు. ప్రయాణికులు సురక్షితంగా బయట పడటంతో అధికారులు ఊపిరిపీల్చు కున్నారు. ప్రమాదానికి
గల నిర్ధిష్టకారణాలు తెలియరాలేదు. హైటెన్షన్ విద్యుత్తు వైర్లు తెగి పడటం వల్ల ప్రమాదం జరిగిందని పలువురు పేర్కొనగా.. బోగీలోని బాత్రూం నుంచి మొదట పొగలు వ్యాపించాయని మరికొందరు అంటున్నారు. ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6.25 నిమిషాలకు బయల్దేరిన ఏపీ ఎక్స్ప్రెస్- 22416 గ్వాలియర్కు 12 కిలోమీటర్ల దూరంలోని బిర్లా రైల్వేస్టేషన్కు 11.45 నిమిషాలకు చేరుకున్నది. ఈ సమయంలో బీ-6 బోగీలు మొదట మంటలు చేలరేగాయి. స్వల్వవ్యవధిలోనే అవి బీ-7కు చేరుకున్నాయి. బోగీలో మంటలు ఆర్పేందుకు కార్బన్డైయాక్సైడ్ సిలెండర్లతో ప్రయత్నించినప్పటికీ అదుపుకాలేదని కొంతమంది ప్రయణికులు తెలిపారు. వెంటనే చైన్ లాగిన ప్రయాణికులు అనంతరం హుటాహుటిన దిగిపోయారు. ఈ క్రమంలో కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రయాణికులు వస్తువులు, సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పారు. అనంతరం ఈ రెండు బోగీలను తొలగించి ఆ ప్రయాణికులను రైలులోని మొదటి బోగీల్లో సర్దుబాటు చేసి పంపించేశారు. కాలిపోయిన బోగీలను గ్వాలియర్ తరలించారు. ఉత్తర మధ్య రైల్వే ఝాన్సీ స్టేషన్ డివిజన్ అధికారి మనోజ్సింహా మాట్లాడుతూ.. విచారణ అనంతరమే మంటలు చేలరేగడానికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. ఇదే రైలులో 37 మంది డిప్యూటీ కలెక్టర్ల ప్రయాణిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలో శిక్షణ పూర్తిచేసుకుని భోపాల్ తిరుగుపయనం అవుతున్నట్టు తెలిసింది. ఈ ప్రమాదంతో ఆ మార్గంగుండా ప్రయణించే పలురైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహన్ ట్వీట్ చేశారు. మంటలను లెక్కచేయకుండా పోలీసు అధికారులు ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న బోగీలను రైలు నుంచి విడదీశారని తెలిపారు. ఘటన నేపథ్యంలో రైల్వే అధికారులు 07572432799, 07512432849 హెల్ప్లైన్ నెంబర్లు విడుదల చేశారు.