Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ సర్కారుపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
లక్నో : హత్య కేసుతోపాటు తీవ్ర నేరాల్లో ప్రమేయమున్న వ్యక్తికి వై కేటగిరీ సెక్యూరిటీ ఎలా కల్పిస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై శుక్రవారం(నేడు) వివరణ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డిబి భోసలే, న్యాయమూర్తి సునీత్కుమార్లతో కూడిన ధర్మాసనం.. యోగి ఆదిత్యనాథ్ సర్కారును ఆదేశించింది. రాష్ట్రంలోని జాన్పూర్కు చెందిన మాజీ ఎంపీ ధనంజరు సింగ్పై 20 కేసులున్నాయి. వీటిలో ఓ హత్య కేసుతో పాటు తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి. కాగా.. ఆయనకు ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రహ్లాద్ గుప్తా అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. యోగి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. 'తీవ్ర నేరారోపణలున్న వ్యక్తికి వై సెక్యూరిటీ భద్రత, అదీ ఉచితంగా కల్పిస్తారా? అంటూ రాష్ట్రప్రభుత్వ తరఫు న్యాయవాది శశి ప్రకాశ్సింగ్ను ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు ధనంజరు సింగ్కు కల్పించిన వై సెక్యూరిటీని తొలగించాలని జాన్పూర్ జిల్లా ఎస్పీ.. ఇదివరకే ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. 'వై' కేటగిరీలో 11 మంది భద్రతా సిబ్బంది(వీరిలో ఇద్దరు కమాండోలు) సెక్యూరిటీగా ఉంటారు.