Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితురాలు
లక్నో: మైనర్పై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... బిజ్నోర్ జిల్లా శివలకల గ్రామానికి చెందిన మైనర్ (16) వంట సామాగ్రి కోసం తన పొరుగింటికి వెళ్లింది. అక్కడ ఉన్న తాహీర్, సర్ఫరాజ్, నజీర్లు ఆమెను గదిలో బంధించి.. లైంగికదాడికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని తన సోదరితో చెప్పింది. అవమాన భారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు. తాహీర్ను అదుపులోకి తీసుకోగా అతడి మిత్రులు పరారీలో ఉన్నారని తెలిపారు.