Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంచలన విషయాలు వెల్లడించిన మాజీ పోలీస్ అధికారి
న్యూఢిల్లీ: అతిలోకసుందరి శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించలేదని.. ఆమె మరణం వెనుక కుట్ర దాగి ఉన్నదంటూ మాజీ పోలీస్ అధికారి ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ యేడాది ఫిబ్రవరిలో దుబారులోని ఓ హోటల్లో బాత్టబ్లో పడిపోయి ఆమె చనిపోయారు. కానీ, ఇది కుట్ర అని.. ఆమె మరణం వెనుక సమాధానాలు దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన వేద భూషణ్ వెల్లడించారు. ఈయన ఓ ప్రయివేటు దర్యాప్తు సంస్థను నడుపుతున్నారు. దీనిపై ఆయన మాటల్లోనే... 'ఘటన జరిగిన దుబారు హోటల్లోని శ్రీదేవి ఉన్న హోటల్కు నేను నా బృందంతో కలిసి వెళ్లాను. కానీ హోటల్ సిబ్బంది ఆమె చనిపోయిన గదిలోకి వెళ్లడానికి అనుమతించలేదు. పక్క గదిలో ఉన్నాం. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఆమె చనిపోయిన విధానాన్ని మేం కూడా అక్కడ ప్రదర్శించి చూశాం. బాత్టబ్లో నీటిని నింపి అందులో ఆమెను ముంచి హత్య చేసి ఉండవచ్చని నేను నిర్ధారించుకున్నాను. ఆమె శవపరీక్ష నివేదిక కూడా అనుమానాస్పదంగానే ఉంది. మద్యం సేవించినందువల్లే ఆమె మరణించారని అందులో ఉంది. కానీ దుబారు పోలీసులు నాకు పూర్తి వివరాలు అందించలేదు. శ్రీదేవి మరణానికి సంబంధించి చాలా విషయాలు ఇంకా అనుమానాస్పదంగానే మిగిలాయి' అని ఆయన 'ఫ్రీ ప్రెస్ జనరల్' నివేదికలో వెల్లడించారు.