Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని పదవిపై ఆశలేదు
- సార్వత్రికంలో తెలుగు రాష్ట్రాలది కీలక పాత్ర
- తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేసింది
- టీడీపీని కాదని ఎవరూ ఏమీ చేయలేరు :తెలంగాణ మహానాడులో చంద్రబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2019 సాధారణ ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు రానున్నాయని తెలుగుదేశం కేంద్ర కమిటీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. అందులో తెలుగు రాష్ట్రాలది కీలకపాత్ర ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు. టీడీపీని కాదని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలుగుదేశం తెలంగాణ శాఖ మహానాడుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీనేగాక తెలంగాణను కూడా మోసం చేసిందని విమర్శించారు. గిరిజన వర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోడీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం ద్రోహం చేసిందని ఆరోపించారు. ఈనేపథ్యంలోనే కేంద్రం నుంచి బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టా మని వివరించారు. నాడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్కు రూపకల్పన చేశారని, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి, యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి 1996లో దేవెగౌడను ప్రధానిని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో పెను మార్పులు వస్తాయని ఆయన అన్నారు. దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని, 20 ఏండ్ల క్రితమే వద్దనుకున్నానని అన్నారు. రెండుసార్లు అవకాశం వచ్చినా తిరస్కరించానని చెప్పారు. ప్రధానమంత్రి పదవి కంటే తెలుగువారికి సేవ చేయడమే తన లక్ష్యమని అభిప్రాయ పడ్డారు. కేంద్రంలో అధికారం వచ్చిందన్న అహంకారంతో, తెలంగాణలో ఏకపక్షంగా బీజేపీ పొత్తు వదులుకుందని ఆరోపించారు. పథకం ప్రకారం ఏపీలో టీడీపీపై బీజేపీ కక్ష కట్టిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరని, పార్టీ జోలికి వస్తే షాక్ కొడుతుందని చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలం పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో పార్టీ మరింత బలోపేతమవు తుందని చ ఎప్పారు. స్వార్ధంతో నాయకులు వెళ్లినా కార్య కర్తలు పార్టీని వీడలేదంటూ చంద్రబాబు వారిని అభినం దించారు. టీటీడీపై కుట్రలు చేస్తున్నారని, బీజేపీ నాటకాలు ఏపీలో సాగవని చంద్రబాబు హెచ్చరించారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే వారి పని అయిపోయినట్టేనని, ఇప్పటికే గొంతు వరకు ఇరుక్కుపోయారని ఎద్దేవాచేశారు. అలిపిరిలో నన్ను కాపాడింది తిరుమల వెంకన్నేనని, వెంకన్న పాదపద్మాల చెంత పుట్టిన తాను.. నిరంతరం ఆలయ పవిత్రతను కాపాడేందుకు కృషిచేస్తున్నానని చెప్పారు. ఏటీఎంల్లో డబ్బులు లేవని, బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. జీఎస్టీని సక్రమంగా అమలు చేయడంలో ఎన్డీయే సర్కారు విఫలమైందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, ట్రిపు ల్ తలాక్లో అరెస్ట్లు వద్దని, చట్టంలో లోపాల గురించి మొదటిసారి మాట్లాడింది తానేనని చంద్రబాబు గుర్తు చేశారు. దేశంలో అవినీతిని అరికట్టలేకపోయారని, గనులు దోచుకున్న గాలి జనార్థన్రెడ్డితో కర్నాటకలో బీజేపీ చేతులు కలిపిందని, ఏపీలోనూ అవినీతిపరులను బీజేపీ చేరదీసిం దని చంద్రబాబు వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాకతో తెలంగాణ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాం వెల్లివిరిసింది. వంద లాదిమందితో ఫోటో లు దిగారు. తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యులు తూళ్ల దేవేందర్గౌడ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసింది టీడీపీయేనని గుర్తు చేశారు. ప్రభుత్వ పాలనను వికేందీకరణ చేసింది ఎన్టీఆర్ హయాంలోనేనని చెప్పారు. అప్పుడే ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చిందని చెప్పారు. టీడీపీ బలోపేతానికి అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో దోపిడీ పెరిగింది: ఎల్.రమణ
ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. తెదేపా పుట్టిన నాటి నుంచి బడుగుల అభివృద్ధి కోసమే కృషిచేస్తున్నదని చెప్పారు. మహానాడులో అధ్యక్షోపన్యాసం చేశారు. తెలుగోడి ఆత్మగౌర వం దిల్లీలో తాకట్టు పెడుతుంటే చూడలేకనే ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని రమణ గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. కార్యకర్తల గౌరవం ఇనుమడింప చేసేలా పనిచేస్తామని అయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేస్తు న్నట్టు చెప్పారు. దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతు న్నాయనడానికి కర్నాటకనే నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం ఏర్పాటు చేసిన పార్టీకి ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలంగాణలో పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. ప్రగతిభవన్ లొసుగుల భవన్గా మారిందని ఆరోపించారు. అందుకు నిదర్శనమే భూ ప్రక్షాళణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందని పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఎన్టీఆర్కు టీడీపీ నేతల నివాళి
తెలుగుదేశం తెలంగాణ శాఖ మహానాడు సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద రాష్ట్ర నాయకులు నివాళులర్పించారు. రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అరవింద్కుమార్ గౌడ్, పెద్దిరెడ్డి, బండ్రు శోభారాౠణి, బుచ్చిలింగం, దయాకర్రెడ్డి, గరికెపాటి మోహన్రావు, అమర్నాథ్, వీరేందర్గౌడ్, తాజుద్దీన్, సీతాదయాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మహానాడులో ఎనిమిది తీర్మానాలపై చర్చించారు. అమ లుకు నోచని టీఆర్ఎస్ హామీలు, సంక్షోభంలో వ్యవసాయం రంగం, టీఆర్ఎస్ పాలనలో కొరవడిన సామాజిక న్యాయం, నిరుద్యోగ సమస్య-ఉపాధి అవకాశాలు-పరిశ్రమల మూసి వేత, పెండింగ్ ప్రాజెక్టులు-ప్రాజెక్టుల రీడిజైన్, సంక్షోభంలో ప్రజాసంక్షేమం-విదా,వైద్య రంగాల నిర్లక్ష్యం, టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు-అస్తవ్యస్త పాలన, బడ్జెట్ కేటాయింపులు-అంకెల గారడి తదితర తీర్మానాలను టీడీపీ నాయకులు ప్రతిపాదించి అమోదించారు. మహానా డుకు మోత్కుపల్లి నర్సింహులును ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ ఆయన అనుచరులు ప్లకార్డులు ప్రదర్శించి నిర సన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా కళాబృందం పాటలు పాడుతుండగా, పార్టీ అధ్యక్షులు రమణ వారించారు. తప్పులు చేసిన వారిని ప్రజ లే శిక్షిస్తారని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఈ కార్యక్రమానికి గైర్హాజర య్యారు.