Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: బెంగాల్లోని మాల్దా జిల్లాకు చెందిన ఓ ముస్లిం కూలీకి ప్రధాని పేరు, రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పలేదని నలుగురు యువకు లు తీవ్రంగా దాడి చేశారు. 'భారత్ మాతా కీ జై', 'వందే మాతరం' నినాదాలు చేయాలని బలవంతం చేశారు. హౌరా-మాల్దా ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్లో ఈ నెల 14న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్కు వలస వెళ్లి కూలి పని చేస్తున్న జమాల్ మోమిన్ స్వగ్రామానికి హౌరా-మాల్దా ట్రైన్లో తిరుగుపయనమవుతుం డగా.. నలుగురు యువకులు ఆయన్ని ప్రశ్నిస్తూ..దాడికి పాల్పడ్డారు. ప్రధాని, సీఎంల పేరు ఏమిటని ప్రశ్నించగా..తనకు తెలియదని, పెద్దగా చదువుకోలేదని మోమిన్ వారికి సంజాయిషీ ఇచ్చాడు. రోజు ప్రార్థన చేస్తావా అని అడగ్గా..అవునని సమాధానమిచ్చాడు. దీంతో రోజు నమాజ్ చేస్తావు గానీ జాతీయ గీతం తెలియదా.. అంటూ ఆయనపై దాడికి దిగా రు. అనంతరం వందే మాతరం, భారత్ మాతా కీ జై అని నినాదాలను బలవంతంగా అనిపించారు. సహ ప్రయాణికులు ఇది గమనిస్తూ.. మౌనంగానే ఉండటం గమనార్హం. బెంగాల్కు చెందిన ఓ ఎన్జీవో మోమిన్ ఇంటికి వెళ్లి..బాధితుడి భార్యతో పోలీసులకు ఫిర్యాదు చేపించింది. నిందితులను పట్టుకుంటామని, మతం ప్రాతిపదికగా దాడి చేసే హక్కు ఎవరికీ లేదని మాల్దా ఎస్పీ అర్ణబ్ ఘోష్ తెలిపారు.