Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ఆన్లైన్ మోసాలు మితిమీరుతున్నాయి. హ్యాకింగ్లో ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. కెనడా, అమెరికా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆర్ఎస్ఏ అనే సైబర్ సంస్థ తన 'క్వార్టర్లీ ఫ్రాడ్ రిపోర్టు'లో ఈ వివరాలను వెల్లడించింది. ఈ యేడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు జరిగిన సైబర్ దాడుల్లో ఫిషింగ్(యూజర్లను మభ్యపెట్టి డేటాను తస్కరించడం) మోసాలే 48 శాతం ఉన్నాయి. సైబర్ దాడుల్లో బ్రెజిల్, కొలంబియా, స్పెయిన్, మెక్సికో, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాలు వరుసగా 4 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి.