Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో అత్యధికం
న్యూఢిల్లీ: వేడి గాలులతో దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్కు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 44నుంచి 46 డిగ్రీల సెల్సియస్లుగా నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉన్నది. దేశవ్యాప్తంగా బుధవారం 170,121 మెగా వాట్ల డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే ఈ డిమాండ్ 8శాతం పెరిగింది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ విడుదల చేసిన లోడ్ జెనరేషన్ బ్యాలెన్సింగ్ నివేదిక ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా హెచ్చుగా ఉండబోతున్నట్టు వెల్లడించింది. శక్తి రీతా 6.8శాతం పెరుగుదల, అత్యధిక డిమాండ్(పీక్ డిమాండ్) దాదాపు 169గిగా వాట్లుగా నమోదవ్వవచ్చునని అంచానా వేసింది. ఎన్నడూ లేని విధంగా చాలా రాష్ట్రాలు తమ డిమాండ్కు తగిన విద్యుత్ను షార్ట్ టర్మ్ మార్కెట్ల ద్వారా పొందుతున్నాయి. ఈ మార్కెట్లలో మంగళవారం 19కోట్ల యూనిట్ల విద్యుత్ వ్యాపారం జరిగినట్టు ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్ పేర్కొంది. ఈ మార్కెట్లలో కొనుగోలు చేయడం వల్ల విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయని ఓ నిపుణుడు తెలిపారు. కాగా, ఇదే సమయంలో బొగ్గు నిల్వల ఇన్వెంటరీలు తగ్గిపోతున్నాయి. విద్యుత్ ఉత్పత్తిలో హైడ్రో పవర్ వాటా ప్రతియేటా తగ్గుతూ రావడం గమనార్హం.