Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ : తూత్తుకుడిలో పోలీసు కాల్పుల ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 28న విచారణ చేపట్టనున్నది. ఈ ఘటనను హత్య కేసుగా నమోదుచేయాలని పిటిషనర్ జిఎస్ మణి తన పిటిషన్లో కోరారు. మంగళ, బుధవారాల్లో తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు మంగళ, బుధవారాల్లో జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాదాపు 70 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. అంతేకాదు 67 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుకుడి పోలీసు సూపరింటెండెంట్ సహా కాల్పుల ఘటనతో సంబంధమున్న అధికారులందరిపైనా కేసు నమోదుచేయాలని పిటిషనర్ కోరారు. ఈ ఘటనను 'నకిలీ ఎన్కౌంటర్, చట్టవిరుద్ధమైన పోలీసు కాల్పులు'గా జిఎస్ మణి పిటిషన్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలనీ కోరారు. కాగా, రాష్ట్ర హోం శాఖ జిల్లాల యంత్రాంగాలకు లేఖ రాయడంతో తిరునెల్వెల్లి, కన్యాకుమారిల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు.
తమిళనాడులో బంద్ విజయవంతం
తూత్తుకుడిలో శుక్రవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 20 వేల మంది భద్రతా సిబ్బందిని తూత్తుకుడి నగరంలో మోహరించారు. పోలీసు కాల్పులకు నిరసనగా, వివాదాస్పద కాపర్ ప్లాంట్ను మూసివేయాలని ప్రతిపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు బంద్కు పిలుపునివ్వగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. బంద్కు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలుకూడా మద్దతు తెలిపాయి. ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ కార్మిక సంఘాలు కూడా బంద్కు మద్దతు ప్రకటించడంతో బస్సులు, ఆటోరిక్షాలు నిలిచిపోయాయి. ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్స్, ఎంప్లాయీస్ యూనియన్స్ సమ్మెలో పాల్గొంటున్నట్టు ప్రకటించాయి. బస్సులో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చెన్నైలోని రాష్ట్ర సచివాలయం వద్ద ఆందోళనకు దిగిన డీఎంకే నేత కనిమొళి, ఇతర పార్టీల నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.