Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలతో మమేకమై.. వారిని ఐక్యం చేయాల్సిన అవసరమున్నదని జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు. 'బిల్డింగ్ యాన్ ఇంక్లూజివ్ ఇండియా సిటిజెన్స్ కాంక్లేవ్' కార్యక్రమంలో 'డెమోక్రసీ అండ్ డిసెంట్' టాపిక్పై ఆయన మాట్లాడారు. 'మనం ప్రజలతో మమేకమై..వారిని ఐక్యం చేయాల్సి ఉన్నది' అని కన్హయ్య కుమార్ పిలుపునిచ్చారు. పరిశోధక విద్యార్థి ఉషా రామనాథన్ మాట్లాడుతూ..ఇండియాలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఆధార్ పేరుతో ప్రజల హక్కులను యూఐడీఏఐ ప్రాజెక్టు కాలరాస్తున్నదని అన్నారు. ఆధార్ కార్డు తమ గుర్తింపును సృష్టించబోదని, అంతేకాకుండా అది మన గుర్తింపును ఫేక్ గుర్తింపుగా మారుస్తున్నదని చెప్పారు. 'బయోమెట్రిక్ సిస్టం పనిచేయకపోవతే నువ్వు...నువ్వుగా గుర్తించబడ లేవ'ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్త జగమతి సంగ్వాన్, ఫిలింమేకర్ సబా దేవన్, రిటైర్డ్ ఐపీఎస్ మీరన్ చదా బోర్వాంకర్, జర్నలి స్టులు రాజ్దీప్ సర్దేశారు, సిద్దార్థ వరదరా జన్లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పౌరులు, పౌర సంఘాలకు ఇండియా ఇంక్లూజివ్ అనే వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమాలు శుక్రవారం మొదలయ్యాయి.