Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హర్యానా,కేరళ బిజెపి నాయకులను ఒడిషా, మిజోరం గవ ర్నర్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల జేసింది.హర్యానా బిజెపి నాయకుడు ప్రొఫెస్ గణేషి లాల్ను ఒడిషా గవర్నరుగాను, బిజెపి కేరళ రాష్ట్ర చీఫ్ కుమ్మనం రాజశేఖరన్ ను మిజోరం గవర్నరుగాను బాధ్యత లు స్వీకరించనున్నారు. 2018 మార్చి నుంచి ఒడిషా గవర్నరుగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న బీహార్ గవర్నరు సత్యపాల్ మాలిక్ను ఆ అదనపు బాధ్యతల నుంచి తప్పిం చారు. మిజోరం గవర్నరు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డు) నిర్భయ శర్మ పదవీ కాల పరమితి మే28తో ముగియనుం ది. ప్రొఫెసర్ గణేషి లాల్ బిజెపి హ ర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బిజెపి క్రమశిక్షణా సంఘంలో సభ్యుడిగా వున్నారు. రాజశేఖరన్ ఆరెస్సెస్ ప్రచారక్గాను, కేరళ బిజెపి చీఫ్గాను పనిచేశారు. ఒడిషాలో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా వుంది. మిజోరం అసెంబ్లీలో దానికి అసలు ప్రాతినిధ్యమే లేదు.