Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాకుళం: ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితుల ఆరోగ్య రక్షణ, వారి సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ సమస్యలను పరిష్కరిం చాలని, ఏపీలో ఆరోగ్య శాఖ మంత్రిని 48 గంటల్లో నియమించకపోతే ఒక రోజు నిరా హార దీక్ష చేపడతానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎటు వంటి స్పందనా లేకపోవడంతో శ్రీకాకు ళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం. పురంలోని దాట్ల రిసార్ట్స్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు దీక్షకు దిగారు.