Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసగించిన కేసులో నీరవ్ మోడీపై రెడ్కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) జారీ చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు రూపొందించిన పత్రాలలో దొర్లిన పొరపాటును ఆ రెండు సంస్థలు చివరి నిముషంలో గమనించి సరిదిద్దుకున్నాయి. అలా చేసి ఉండకపోతే నీరవ్ను వెనుకకు రప్పించే ప్రయత్నంలో దర్యాప్తు సంస్థలు రెండింటికి పెద్ద ఎదురుదెబ్బ తగిలేది. దర్యాప్తు సంస్థలు రెండూ వేరువేరుగా రూపొందించిన పత్రాలలో ఒక దాంట్లో నీరవ్ దీపక్ కేశవ్లాల్ మోడీ అని పేర్కొనగా, మరో దాంట్లో నీరవ్ కేశవ్లాల్ దీపక్ మోడీ అని పేర్కొన్నారు.