Authorization
Mon Jan 19, 2015 06:51 pm
21 యేండ్లపాటు జడ్జిగా బాధ్యతలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. 21 ఏండ్లపాటు న్యాయ మూర్తిగా సేవలందించిన ఆయనకు పలు కీలక కేసుల తీర్పుల్లో ప్రమే యమున్నది. వ్యవస్థలోని లోటుపాట్లపై పోరాటం చేశానని వెల్లడించిన ఆయన.. సమస్యలు ఇప్పటికీ అలాగే కొనసా గుతున్నాయని చెప్పారు. ఈ యేడాది జనవరి 12న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరే కంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తుల్లో చల మేశ్వర్ ఒకరు. ఈ సమావేశం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భారత సర్వోన్నత న్యాయ స్థానంలో పాలనాపరమైన లోపాలను జడ్జిలు బహి రంగంగా ఎత్తిచూపడం ఇదే తొలిసారి. అంతేకాక.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సంచలన తీర్పు వెలువరించిన తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనంలో చలమేశ్వర్ కూడా ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో 1953 జూన్ 23న జన్మించిన చలమేశ్వర్.. దాదాపు 42 ఏండ్ల పాటు న్యాయవ్యవస్థలో సేవలందించారు. కేరళ, గౌహతి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2011 అక్టోబర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. న్యాయమూర్తిగా చలమేశ్వర్ పదవీకాలం ముగియవ స్తుండటంతో ఆనవాయితీ ప్రకారం.. ఆయనకు మే 18న వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయించింది. కాగా.. తనకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయవద్దని బార్ అసోసియేషన్కు చలమేశ్వర్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.