Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది మంది నిందితులు అరెస్టు
జార్ఖాండ్లో దారుణం
రాంచీ: మానవ అక్రమ రావాణాకు వ్యతిరేకంగా వీధి నాటకం నిర్వహిస్తున్న ఐదుగురు ఎన్జీవో మహిళా కార్యకర్తలను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన జార్ఖాండ్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఖుంటి జిల్లాలోని చోచాంగ్ గ్రామంలో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి క్రిష్టియన్ మిషనరీకి చెందిన ఓ స్వచ్చంధ సంస్థ ప్రచారం చేపట్టింది. అందులో భాగంగానే కొంతమంది కార్యకర్తలు మంగళవారం ఒక వీధినాటకం నిర్వహించారు. అనంతరం వారు స్థానిక పాఠశాలకు వెళ్తుండగా కొంతమంది సాయు ధులైన దుండగులు వారిని అడ్డగించారు. తుపాకులతో బెదిరించి ఐదుగురు మహిళా కార్యకర్తలను సమీప అటవీప్రాంతంలోకి తీసుకెళ్లారు. వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని వీడియో తీయడమే కాకుండా ఎవరికైనా చెపితే దాన్ని వైరల్ చేస్తామని బెదిరించారు. దాదాపు మూ డు గంటల తర్వాత బాధితులను వదిలేశారు. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని, కేసు విచారణ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని రాంచీ డీజీపీ ఏవీ హోంకర్ తెలిపారు.
ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య
భోపాల్: పెండ్లి వేడుకకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన ఆరేండ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగికదాడికి పాల్పడి హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కంపూ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఆరేండ్ల చిన్నారి వివాహ వేడుక వద్ద తన తల్లిదండ్రుల పక్కనే పడుకుంది. దాహం వేయడంతో నీళ్లు తాగడానికి లేచింది. నీళ్లు తాగడానికి వెళ్లిన చిన్నారి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. అయినా ఆమె దొరక్కపో వడంతో పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సమీపంలోని పొదల్లో చిన్నారి మృతదేహాన్ని గురువారం కనుక్కున్నారు. కాగా, చిన్నారిపై లైంగిక దాడికి ఒడిగట్టిన తర్వాత ఆ దుండగుడు ఆమె గొంతు నులిమి చంపేశాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. సంబంధిత ఐపీసీ సెక్షన్లు, పోక్సో యాక్ట్ కింద పరారీలో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేశామని గ్వాలియర్ ఎస్పీ నవనీత్ భాసిన్ చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.