Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో పెత్తందార్ల ఘాతుకం
భోపాల్: దళితులపై పెత్తందార్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. భూ వివాదం మూలంగా మధ్యప్రదేశ్లో ఓ దళితరైతును కొందరు పెత్తందార్లు సజీవంగా దహనం చేశారు. మధ్యప్రదేశ్లో భోపాల్ జిల్లాలోని బెరాసియా ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కిశోరిలాల్ జాతవ్కు 3.5 ఎకరాల భూమిని 2000 సంవత్సరంలో ప్రభుత్వం అందజేసింది. ఈ భూమి పక్కనే పెత్తందార్ల భూమి ఉన్నది. ఆ పెత్తందారీ కుటుంబీకులు జాతవ్ భూమిని తమ భూమిలో కలుపుకుని సాగుచేసుకునే ఉద్దేశంతో గురువారం దున్నడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జాతవ్ తన భార్యతో పరుగు పరుగున భూమి వద్దకు చేరుకున్నారు. భూమిని దున్నుతున్న తిరణ్ యాదవ్, ఆయన కొడుకు ప్రకాశ్, బంధువులు బల్బిర్, సంజులను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఈ నలుగురు జాతవ్ను తీవ్రంగా కొట్టారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి ఆ నలుగురు పరారయ్యారు. కాగా, జాతవ్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ హేమంత్ చౌహాన్ తెలిపారు.