Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిని తొలగిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఆయనే సారథ్యం వహించనున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా స్పష్టం చేశారు. మీడియా ముందు ఇష్టారీతిన ప్రకటనలు చేస్తున్న పార్టీ నేతలపై క్రమశి క్షణా చర్యలు చేపడతామని హెచ్చరిం చారు. అధిష్టానం పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం ఢిల్లీకి వచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా, తెలంగాణకు నూత నంగా ఎంపికైన ముగ్గురు కార్యదర్శులతో ఢిల్లీలోని వార్రూంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమావేశనంతరం కుంతియా మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత బలోపేతం, తదితర చర్చించినట్టు తెలిపారు.