Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్: తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని, కాంగ్రెస్ మాత్రం అబద్ధాలు చెబుతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం మధ్యప్రదేశ్లోని మోహన్పురా ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం మోడీ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భం గా నిర్వహించిన కార్యక్రమంలో జనసంఫ్ు వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీజేపీ ప్రజల్లో ఉన్న నిరాశను తొలగించే విధంగా పాలన చేస్తోందని, కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలను ప్రజలు విశ్వసించబోరని ఆయన పేర్కొన్నారు. యువతను ముందుకు తీసుకొచ్చేందుకు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎంతో కృషి చేశారని తెలిపారు. యువతకు మెరుగైన నైపుణ్యాన్ని అందించడం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారని, ఆయన స్ఫూర్తితోనే 'మేకిన్ ఇండియా' కార్యక్రమం ప్రవేశపెట్టామన్నారు. ఆయన రచనలను వక్రీకరించి చూపేందుకు కాంగ్రెస్ కుటుంబం ప్రయత్నాలు చేసిందన్నారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించినా కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించలేదని తెలిపారు. పేద రాష్ట్రంగా పేరుపడిన మధ్యప్రదేశ్ అభివృద్ధికి తమ పార్టీ ఎంతో కృషి చేస్తోందని అన్నారు.