Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందువులను ఏకం చేసి, ముస్లింలను విడగొట్టడం వల్లే 2014లో విజయం
న్యూఢిల్లీ: ఆర్థికపరమైన వృద్ధితో కాదు, భావోద్వేగాలతోనే ఎన్నికల్లో విజయం వరిస్తుందని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మోడీకి తెలపాలని ఉన్నదని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. నరసింహా రావు కానీ, వాజపేయి కానీ ఆర్థికపరమైన వృద్ధితో గెలుపొందలేరని అన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్డీయే అమలు చేసిన వ్యూహాల గురించి చర్చిస్తూ.. దేశంలో అప్పటి వరకు రూపొందించిన వ్యూహాలకు పూర్తిగా భిన్నమైన వ్యూహాలను రూపొందించారని చెప్పారు. తాము హిందువులను ఏకం చేశామని, అదే సమయంలో ట్రిపుల్ తలాఖ్ బిల్లు సహాయంతో ముస్లిం ఓటు బ్యాంకు నుంచి ముస్లిం మహిళలను చీల్చామని చెప్పారు. బోహ్రా, షియా, సున్నీల మధ్య పొరపొచ్చలు ఏర్పరచి వాహాబి సున్నీలను ఏకాకి చేశామని తెలిపారు. దేశంలో 70 ఏండ్ల రాజకీయంపై మాట్లాడుతూ.. హిందువులను కులం, ప్రాంతం, భాష, వర్ణాల ఆధారంగా విభజించే వ్యూహాలు రచించారని, ఇప్పటివరకు మైనారిటీ, ఎస్సీ, ఓబీసీల ఓట్లతో మెజారిటీని రూపొందించారని అన్నారు.