Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పవిత్ర సంగమం'లో నలుగురు విద్యార్థులు గల్లంతు
- గోదావరిలో నాలుగు మృతదేహాలు లభ్యం
విజయవాడ: ఇది జలవిషాదం! జలక్రీడ నాలుగు కుటుంబాలకు తీరని క్షోభను కలిగించాయి. పవిత్ర సంగమం వద్ద సరదాగా కృష్ణానదిలోకి దిగిన నలుగురు విద్యార్థులు గల్లంతైనారు. శనివారం రాత్రి వరకూ వారి ఆచూకీ లభించలేదు. ఈ విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మరో ఘటనలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు లాంచీల రేవు వద్ద గోదావరిలో నాలుగు మృత దేహాలు కనిపించాయి. వీరి మరణాలకు కారణం తెలియరాలేదు. స్నేహితుడిని కాపాడటానికి నీటిలోకి దిగిన మరో ముగ్గురు విద్యార్థులు కృష్ణా నది ఉరవడిలో చిక్కుకున్నారు. ఒడ్డున ఉన్న వారు చూస్తుండగానే కొట్టుకుపోయారు. శనివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో విజయవాడ పవిత్ర సంగమం వద్ద ఈ సంఘటన జరిగింది. కంచికచర్లలోని మిక్ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు పవిత్ర సంగమం చూసేందుకు వచ్చారు. ఇటీవలే గోదావరి నీటిని కృష్ణాకు విడుదల చేయడంతో పవిత్రసంగమం వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిని అంచనా వేయడంలో పొరపడిన వీరు నదిలో స్నానాలకు దిగారు. తొలుత నీటిలో దిగని ప్రవీణ్ (18) అనే విద్యార్థి పట్టుతప్పి కొట్టుకుపోతుండటంతో గమనించిన అతని స్నేహితులు చైతన్య (18), శ్రీనాధ్ (19), రాజ్కుమార్ (19)లు ప్రయత్నించారు. అయితే, వ్రీరి ప్రయత్నాలు ఫలించకపో వడంతో పవాహ ఉధృతికి వారు కూడా కొట్టుకుపోయారు. వారితో వచ్చిన మరో విద్యార్థి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలియడంతోనే స్థానిక గజ ఈతగాళ్లుగాలింపు చర్యలు చేపట్టారు. ఆ తరువాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది 10 బోట్లతో 100 మంది రంగంలోకి దిగారు. మృతుల్లో శ్రీనాద్ కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన నర్శింగ్ కృష్ణయ్య, రాజేశ్వరీ దంతుల కుమారుడు. అలాగే నాగచైతన్యరెడ్డి కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రాఘవాపురానికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు. ఇతను వ్యవసాయకార్మికునిగా పని చేస్తున్నాడు. శ్రీనాథ్ తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాజ్కుమార్ విజయవాడ కొత్తపేటకు చెందిన వాడు. చైతన్య కృష్ణాజిల్లా మైలవరం గ్రామానికి చెందిన వాడు.
గాలింపు చర్యలు నిలిపివేత
పెద్ద ఎత్తున చేపట్టిన గాలింపు చర్యలను రాత్రి 7.30 గంటల ప్రాంతంలో నిలిపివేశారు. చీకటిపడటంతో గాలిం పు చర్యలు అసాధ్యంగా మారాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం తిరిగి గాలింపు ప్రారంభిస్తామని చెప్పా రు. కృష్ణానదిలో అక్కడక్కడా తుప్పలు, చెట్లు ఉండటంతో గల్లంతైన వారు సురక్షితంగా ఉండే అవకాశం కూడా ఉం దని జాయింట్ పోలీస్కమిషనర్ క్రాంతిరాణా చెప్పారు. భద్ర త కోసం ఏర్పాటు చేసిన రైలింగ్ను దాటి నదిలోకి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఆయన అన్నారు. అంతకుముందు సమాచారం తెలిసిన వెంటనే కృష్ణాజిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విజరు కృష్ణ, సంయుక్త కలెక్టర్ బాబూ రావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, జాయింట్ కమిషనర్ కాంతి రాణా, జిల్లా ఉన్నతాధికారులు, సిపిఎం పశ్చిమ కృష్ణా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి.ఆం జనేయులు, ఎస్ఎఫ్ఐ పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షు లు కోటి, కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు, డివైఎఫ్ఐ పశ్చిమ కృష్ణాజిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి తదితరులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.
అవసరమైతే అదనపు సిబ్బందిని : సీఏం
విద్యార్థులు గల్లంతైన విషయం తెలుసుకున్న సీఏం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఇన్ఛార్జి కలెక్టర్తో మాట్లాడారు. విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని రప్పించి ఆచూకీ కోసం ప్రయత్నించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల గల్లంతుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
గోదావరిలో ఆత్యహత్యేనా?
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు శ్రీకృష్ణచైతన్య స్నానఘట్టం (లాంచీలరేవు) వద్ద గోదావరి నదిలో శనివారం నాలుగు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను గోదావరి నది నుండి వెలుపలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి ఎస్.వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ గోదావరి నదిలో లభ్యమైన నాలుగు మృతదేహాల్లో ముగ్గురు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు.
లభించిన ఆధారాలను బట్టి మృతులు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి గ్రామానికి చెందిన పి.రవికుమార్ (27), అతని భార్య పావని (24), కుమార్తె పూజిత (4)గా గుర్తించామని చెప్పారు. మరోమృతదేహం వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వీరంతా గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఒకే రోజు నాలుగు మృతదేహాలు లాంచీ రేవు సమీపంలోని గోదావరి నదిలో లభ్యం కావడంతో సంచలనం సృష్టించింది.