Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజాయ్ వయస్సులో ఆర్థిక పొదుపు సూత్రాలకు రెడీ
- మ్యారేజ్ ఫంక్షన్లకు వేలాది బంధుగణం అక్కర్లేదంటున్న మిలీనియల్స్
- పదిలక్షల లోపే బడ్జెట్.. అదీ సొంత ఖర్చులతోనే! కుదరకపోతే, ఫ్యామిలీ హెల్ప్
అంత ఖర్చెందుకు?
కడవేర్గు
ప్రపంచవ్యాప్తంగా పనిచేసే శ్రామిక శక్తిలో దాదాపు పాతిక శాతం ఉన్న సహస్రాబ్ధి యువత (మిలీనియల్స్) చేస్తున్న కొత్త ్త ఆలోచనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఉద్యోగాల్లో చేరి పెండ్లిండ్లు చేసుకొనే ఈడులో సదరు యువతరం తీసుకుంటున్న అర్ధవంతమైన నిర్ణయాలపై తాజాగా వెలువడిన అధ్యయన సారాంశమే ఇందుకు సాక్ష్యం..
షాపింగ్లు, రెస్టారెంట్ భోజనాలు, సినిమాలు, షికార్లు.. ఇలాంటివన్నీ ఎంజారుచేసే వయస్సులోనూ ఆర్ధిక పొదుపు సూత్రాలపై యంగ్ తరంగ్ చూపుతోన్న ప్రత్యేక శ్రద్ధ హర్షణీయమైనదని ప్రముఖ వివాహ వేదిక ఃవెడ్డింగ్ బ్రిగేడ్ః పేర్కొంది. ఇక, సదరు సంస్థ 500మంది నవ్య మిలీనియల్స్ దంపతులపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. పెండ్లంటే దగ్గర, దూరం అనే తేడా లేకుండా యావత్ బంధుగణం దిగాల్సిందే! ఐతే, నేటి మిలీనియల్స్ ఆలోచనల ప్రకారం.. ఫ్యామిలీ, అత్యంత దగ్గరి ఫ్రెండ్స్ సమక్షంలో పెండ్లిండ్లు చేసుకోవడానికే తాము ఇష్టపడతామని, అనవసరంగా వృథా ఖర్చులు చేస్తూ.. వేలాది మందిని పిలవడం ఎందుకని? అధ్యయనంలో పాల్గొన్న 75శాతం మంది యువతరం అభిప్రాయపడ్డారు. వందలోపు అతిథుల సమక్షంలో పెండ్లి చేసుకోవడానికి 33శాతం మంది ఃసైః అంటే, 200-400 వరకు అయినా పరవాలేదంటున్న వాళ్ళు 42శాతం. ఇక, 26శాతం మంది యువత తమ సొంత సంపాదనతోనే పెండ్లి చేసుకోవాలని భావిస్తుండగా.. 42శాతం మంది పెండ్లి విషయంలో ఫ్యామిలీకి చేదోడువాదోడు గా ఉంటామని అభయమిస్తున్నారు. కాగా, సర్వేలో పాల్గొన్న 33శాతం మంది మిలీనియల్స్ పది లక్షల రూపాయల లోపే వివాహం అయ్యేలా ప్లాన్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతామని పేర్కొనడం విశేషం.
సంపాదన, పొదుపే ముఖ్యం:
కుటుంబ ఆదాయంలో డెబ్బై శాతం సంపాదనతో దూసుకుపోతున్న మిలీనియల్స్ జీవన విధానం.. రాబోయే కాలంలో పెద్ద స్థాయిలో మారే అవకాశమున్నదని సీబీఆర్ఈ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం 24శాతం మంది మిలీనియల్స్ తమకు వస్తున్న సంపాదనలో కనీసం పాతిక శాతం పొదుపు చేస్తుండగా, రాబోయే మూడేండ్లలో వీరి సంఖ్య 40శాతానికి పెరుగుతుందని, ప్రస్తుతం 58శాతం మంది మిలీనియల్స్.. నెలకు మూడు సినిమాలు థియేటర్లో చూస్తుండగా.. వచ్చే మూడేండ్లలో ఈ సంఖ్య 42శాతానికి పడిపోవచ్చని సర్వే పేర్కొంది. దీనికి కారణం.. సినిమా థియేటర్ కి వెళ్ళడం రావడం ఇలా ఎక్కువ సమయాన్ని కోల్పోయే కంటే, ఆన్ లైన్ / డిజిటల్ వీడియో స్ట్రీమ్ సర్వీసుల్లో సినిమా వీక్షణకే యువతరం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వొచ్చని సర్వే ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇక, ప్రస్తుతం ఆన్లైన్ లో కొనుగోళ్లు చేస్తున్న మిలీనియల్స్ సంఖ్య 70శాతం ఉండగా, అది రాబోయే మూడేండ్లలో 47శాతానికి పైగా పడిపోవచ్చని అంచనా!