Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ అదుపులో ఉంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం
- ప్రజాస్వామ్యంలో పాలన చట్టాలపైనే ఆధారం.. వ్యక్తులపై కాదు :సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్
కోచి: అధికార దుర్వినియోగానికి చెక్ పెట్టేలా రాజ్యాంగం (కోర్టులు) పని చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సూచించారు. అధికారానికీ, స్వాతంత్య్రానికీ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించాలన్నారు. అధికారాన్ని దుర్విని యోగం చేయడం మానవ స్వభావంలోనే ఉన్నదని జస్టిస్ చలమే శ్వర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య సమాజాలు చట్టబద్ధ పాలనపై ఆధారపడ్తాయని, వ్యక్తుల ఆదేశాలపై కాదని ఆయన అన్నారు. అం దువల్లే రాజ్యాంగం తప్పనిసరి అవసరమని ఆయన స్పష్టం చేశారు. కర్నాటక హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించే అంశంలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థను తమ అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాయని చలమేశ్వర్ అన్నారు. ఓవేళ మనుషులు దేవదూతలైతే ప్రభుత్వమే అవసరముం డదు, దేవదూతలే మనుషుల్ని పాలిస్తే చట్టాలే అవసరముండదని జస్టిస్ చలమేశ్వర్ చమత్కరించారు. మానవ బలహీనతలను పరిగ ణనలోకి తీసుకొని రాజ్యాంగబద్ధ ప్రభుత్వా లు పని చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రధానంగా రెండు రకాల పరిస్థితుల్లో న్యాయ మూర్తులు స్వతంత్రతను కోల్పోతారని చలమేశ్వర్ తెలిపారు. ఒకటి: తన గురించి ఏదైనా దాచిపెట్టినపుడు. రెండోది:తన లక్ష్యాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడా నికి అడ్డుపడిన పుడు అంటూ ఆయన విశ్లేషిం చారు. తన సామర్థ్యాల్ని పూర్తిగా స్వతంత్రంగా వినియోగించినపుడే ఏ న్యాయమూర్తియైనా ఆత్మ విశ్వాసంతో ఉంటారని చలమేశ్వర్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే న్యాయవాదులకు అధిక ఫీజులు చెల్లించాల్సి రావడంపై అడిడిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఫీజుల అంశం అడ్డంకి కాబోదని అన్నారు. ఎక్కువగా భారీ వ్యాపార అంశాలు, రాజ్యాంగపరమైన సమాఖ్య అంశాలు సుప్రీంకోర్టు దాకా వస్తాయని ఆయన వివరించారు. అయితే, అప్పుడప్పుడూ సాధారణ పౌర, నేర వివాదాలు కూడా సుప్రీంకోర్టుకు వస్తాయని ఆయన తెలి పారు. సాధారణ పౌరులకు సంబంధించిన అంశాలు ఎక్కువ భాగం హైకోర్టుల పరిధిలోనే పరిష్కారమవుతాయని ఆయన తెలి పారు. కేరళలోని కోచిలో మనోరమ న్యూస్ టీవీ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో చలమేశ్వర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.