Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెంట్లు కూలి 90మందికి గాయాలు
- బాధితుల్లో 24 మంది మహిళలు, ఇద్దరి పరిస్థితి విషమం
- పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో ఘటన
మిడ్నాపూర్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్న సభలో టెంట్లు కూలి 90మంది వరకూ గాయపడ్డ ఘటన పశ్చిమ బెంగా ల్లో జరిగింది. సోమవారం మిడ్నాపూర్లో ఏర్పాటు చేసి న బహి రంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా ఈ సంఘ టన చోటు చేసుకున్నది. స్టేజి ముందు వేసిన టెంట్లకు సపోర్ట్గా ఉన్న ఇనుప రాడ్లు(పోల్స్) ఎక్కి ప్రధానిని చూసేందుకు బీజేపీ కార్యకర్తలు అత్యు త్సాహం చూపారు. దీంతో టెంట్లు అమాంతంగా కూలిపోయాయి. ఈ ఘటనతో కుర్చీల్లో కూర్చున్న జనం అమాంతంగా పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇటు జనంలో కనిపిస్తే.. మరోవైపు మోడీ భద్రత బలగాలు సైతం హడలిపోయాయి. ఇంతలో తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించిన ప్రధాని.. కార్యకర్తలను సురక్షితంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. గాయ పడినవారిని వెంటనే సమీపంలోని మిడ్నాపూర్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వీరిలో 24 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పంచానన్ కుండు వెల్లడించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు. మిడ్నాపూర్ వైద్య కళాశాల ఆస్పత్రికి మోడీ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అయితే వర్షం, గాలుల వల్ల టెంట్లు కూలినట్టు చెబుతున్నారు. ఈ ఘటనలో ఒక కేసు నమోదు చేశామని, దీనిపై విచారణ జరుపుతున్నామని పశ్చిమ మిడ్నాపూర్ పోలీసు అధికారి అలోక్ రాజోరియా వెల్లడించారు.