Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోటు దక్కని నలుగురు సీనియర్లు, ఈ నెల 22న తొలి భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రకటించారు. నూతన కమిటీలో సీనియర్ నేతలైన దిగ్విజరుసింగ్, జనార్థన్ద్వివేది, కమల్నాథ్, సుశీల్కుమార్షిండే, కరణ్సింగ్లకు చోటు లభించలేదు. గత సీడబ్ల్యూసీలో వీరు సభ్యులు. 23మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సీడబ్ల్యూసీలో ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మోతీలాల్వోరా, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున్ఖర్గే, ఎకె ఆంటోనీ,అహ్మద్పటేల్, అంబికాసోనీలకు తిరిగి చోటు కల్పించారు. కొత్తగా సీడబ్ల్యూసీలోకి మాజీ ముఖ్యమంత్రులు అశోక్గెహ్లాట్, ఊమెన్చాందీ,తరుణ్గొగోరు,సిద్ధరామయ్య, హరీశ్రావత్ను తీసుకు న్నారు. వీరికి తోడుగా 18మంది శాశ్వత ఆహ్వానితులు, 10మంది ప్రత్యేక ఆహ్వానితులను రాహుల్గాంధీ నియమించారు. శాశ్వత ఆహ్వానితుల్లో షీలా దీక్షిత్, పి.చిదంబరం,జ్యోతిరాదిత్య సింధియా, బాలాసాహెబ్ తొరాట్, తారిఖ్ హమీద్లకు చోటు కల్పించారు. సీడబ్ల్యూసీ తొలి భేటీ ఈ నెల 22న జరగనున్నది. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ తమ భవిష్యత్ వ్యూహాల గురించి చర్చించనున్నది. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన సీడబ్ల్యూసీ ఇదే. అధ్యక్షుడి ఎన్నికలకు ముందు సీడబ్ల్యూసీని రద్దు చేశారు.