Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష ప్రభుత్వం ప్రారంభించిన
- 8 పీహెచ్సీల నిర్మాణం నిపివేత
బీజేపీ-ఐపీఎఫ్టీ ప్రభు త్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహ రిస్తోంది. వామపక్ష ప్రభుత్వ హయాంలో అనుసరించిన వికేంద్రీ కరణ విధానం లో భాగంగా వైద్య సౌకర్యాలను మారుమూల గిరిజన ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వామపక్ష ప్రభుత్వం కొన్ని గ్రామాలకు ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) చొప్పు న బ్లాక్ స్థాయిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటికి అనుసంధానం చేస్తూ సబ్ డివిజన్, జిల్లాస్థాయి ఆస్పత్రులు, రాష్ట్రస్థాయి, వైద్య కళాశాలల ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. ఇందుకు భిన్నంగా బీజేపీ ప్రభుత్వం పట్టణాలకే ఆరోగ్య సేవల్ని పరిమితం చేస్తోంది. ఈ ఏడాది ఒక్క పీహెచ్సీ కూడా నిర్మించొద్దని విధాన నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా రాష్ట్రానికి మంజూరైన 8 పీహెచ్సీల నిర్మాణాన్ని వామపక్ష ప్రభుత్వం ప్రారంభించగా, ఏ కారణమూ చెప్పఉండానే బీజేపీ ప్రభుత్వం వాటిని అర్ధాంతరంగా నిలిపివేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కల్పన పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఆసక్తి లేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.