Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన బీజేపీ సర్కార్
అగర్తలా: త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగులకిచ్చిన హామీలను తుంగలో తొక్కుతోంది. ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన బీజేపీ సర్కార్ అందుకు విరుద్ధమైన నిర్ణయాలతో ఉద్యోగుల జీతాలకు కోత విధించే నూతన పెన్షన్ పథకాన్ని(ఎన్పీఎస్) ప్రవేశపెట్టింది. గతంలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం అమలు చేసిన సార్వత్రిక పెన్షన్ పథకాన్ని రద్దు చేసింది. భాగస్వామ్య పెన్షన్ పథకం(సీపీఎస్) నమూనాలో ఎన్పీఎస్ ఉన్నది. ఈ పథకం ప్రకారం ఉద్యోగుల మూల వేతనంలో ప్రతి నెలా 10 శాతానికి కోత పడుతుంది. దానికి ప్రభుత్వం తరఫున చేర్చేది కూడా ఏమీ లేకపోవడం గమనార్హం. ఎన్పీఎస్ను ఈ ఏడాది జులై 1 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారికి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదార ఆర్థిక విధానాల్లో భాగంగా త్రిపురలోని బీజేపీ సర్కార్ ఎన్పీఎస్ అమలుకు పూనుకున్నది.
బీజేపీ-ఐపీఎఫ్టీ పట్ల గిరిజనుల్లో పెరుగుతున్న అసంతృప్తి
త్రిపురలోని గిరిజనుల్లో బీజేపీ- ఐపీఎఫ్టీ సంకీర్ణ ప్రభుత్వం పట్ల భ్రమలు తొలిగి పోతున్నాయి. ప్రత్యేక త్రిపురాల్యాండ్ డిమాండ్తో ఏడాది క్రితం బర్రాముర్రా కొండ ప్రాంతంలోని గ్రామాల్లో 10రోజులపాటు రైలు, రోడ్డు మార్గాలను దిగ్బంధించిన ఐపీఎఫ్టీ తమకిచ్చిన హామీలను విస్మరించిందన్న ఆవేదన ఆ ప్రాంత గిరిజనుల్లో వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే కొండిపాంత గ్రామాల్లోని గిరిజనులందరికీ ఉద్యోగాలొస్తాయని, పేదరికం తొలగిపోతుం దంటూ ఐపీఎఫ్టీ నమ్మబలికింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన ఐపీఎఫ్టీ తమకోసం ఏమీ చేయకపోగా గతంలో వామపక్ష ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేయ డంలేదన్న ఆవేదన అక్కడి గిరిజనుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరిజనులకు కల్పించింది ఆరు పని దినాలు మాత్రమే కావడం గమనార్హం. ఈ పథకం కింద ఇవ్వాల్సిన దినసరి కూలీ రూ.178ని తగ్గించి రూ.125కే పరిమితం చేయడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో ఈ పథకం కింద ఇచ్చే రోజు కూలీని రూ.340కి పెంచుతామంటూ బీజేపీ హామీ ఇచ్చింది. మరోవైపు చౌకధరల దుకాణాల ద్వారా అందించాల్సిన ఆహారధాన్యాలకు కూడా కోత విధించారు. దీంతో, తాము బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమికి ఓట్లు వేసి మోసపోయినట్టుగా గిరిజనులు భావిస్తున్నారు.
* మెడికల్ సీట్ల కుంభకోణం
- నీట్ మెరిట్ జాబితాలో లేని బయటివారికి సీట్లు
- విచారణకు ఎస్ఎఫ్ఐ డిమాండ్
త్రిపురలో రెండు వైద్య కళాశాలలుండగా, వాటిలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం సీబీఎస్ఈ ఆధ్వర్యంలో నీట్ పేరుతో జాతీయస్థాయి పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సీబీఎస్ఈ నీట్ విడుదల చేసిన ఆ రాష్ట్ర మెరిట్ జాబితాలో లేని 9మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. దాంతో, ఆ 9మందిని అనర్హులుగా ప్రకటిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) ఈ నెల 7న ఆదేశాలిచ్చారు. రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతుల్ని పక్కన పెట్టి 9మంది బయటివారికి సీట్లు ఎలా కేటాయించారన్నదానిపై పలు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా అనర్హులుగా ప్రకటించిన 9మందిలోంచి పాట్రిక్ ఘార్గా అనే విద్యార్థికి ప్రవేశం కల్పించేందుకు డీఎంఈ ఈ నెల 12న తిరిగి అనుమ తిచ్చారు. ఏ ప్రాతిపదికన తిరిగి ప్రవేశం కల్పించారో వివరణ ఇవ్వకపోవడంతో దీని వెనకాల ప్రభుత్వ పెద్దలే ఉన్నట్టు విమర్శలొ స్తున్నాయి. త్రిపురలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికా రంలో ఉన్న విషయం తెలిసిందే. ఆల్ ఇండియా(జాతీయ) కోటా కింద త్రిపుర వైద్య కళాశాలల్లో ప్రవేశం కల్పించిన మ రో 20 సీట్ల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, టీఎస్యూ డిమాం డ్ చేస్తున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. తాజా ఉదంతంతో కాంగ్రెస్ హయాంలో (1988-93) జరిగిన వైద్యసీట్ల కుంభకో ణాన్ని త్రిపురవాసులు గుర్తు చేసుకుంటున్నారు. బయటివారికి సీట్లు కేటాయించడంపై అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సుధీర్రంజన్ మజుందార్్పై సీబీఐ విచారణ జరిగిన విషయం గమనార్హం.