Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది మృతి
తిరువనంతపురం: కేరళలో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. భారీవర్షాల కారణంగా వరదలు తీవ్రమవ్వటంతో పలుచోట్ల జనావాసాలు నీట మునిగాయి. దాదాపు 34,693 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 265కు పైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించారు. కొట్టాయం, ఇడుక్కీ, పతనంతిట్టా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి పంట, ఆస్తి నష్టం జరిగింది. దాదాపు రూ. ఎనిమిది కోట్ల విలువైన ఆస్తి నష్టం సంభవించిందని కేరళ రెవెన్యూశాఖ మంత్రి ఇ చంద్రశేఖరన్ తెలిపారు. మరో రెండుమూడు రోజుల వరకూ ఇదే స్థాయిలో వర్షాలు పడే అవకాశముందని భారత వాతవరణశాఖ వెల్లడించడంతో అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్... జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.