Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ కన్న తక్కువ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వేగాన్ని అందుకోవడంలో భారత్ బాగా వెనుకబడింది. త్వరలో 5జీ ని అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం సంస్థలు ప్రయత్నం చేస్తున్నా.. ప్రస్తుతమున్న 4జీ సేవల వేగం ప్రపంచ దేశాల కంటే చాలా నెమ్మదిగా ఉన్నదని స్పీడ్ టెస్టింగ్ ప్లాట్ఫాం ఓక్లా తన నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం.. 124 దేశాల్లో 4 జీ సేవలు అందుబాటులో ఉండగా వీటిలో భారత్ స్థానం 109. నిత్యం ఉగ్రదాడులతో సతమతమవుతున్న పొరుగు దేశం పాకిస్థాన్ ఈ విషయంలో మనకంటే చాలా ముందున్నది. ప్రపంచదేశాల సరాసరి 4జీ వేగం 17 ఎంబీపీఎస్లు కాగా.. భారత్లో 6.1 ఎంబీపీఎస్ గా ఉన్నది. పాక్ లో ఇది 13.56. పాక్తో పాటు శ్రీలంక (15.56), మయన్మార్ (13.95)లు మనకంటే ముందంజలో ఉన్నాయి. కాగా, స్పెక్ట్రమ్ కేటాయింపులు సరిగ్గా లేకపోవడం వల్లే భారత్లో 4జీ వేగం నెమ్మదించిందని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రాజన్ అభిప్రాయపడ్డారు.