Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.20 వేల జరిమానా
- జేఎన్యూ అధికారుల నిర్వాకం
- పకోడీలు అమ్మినందుకు..రూ. 20 వేల జరిమానా
న్యూఢిల్లీ: నిరుద్యోగులు ప్రభుత్వుద్యోగం కోసం వేచి చూడకుండా పకోడీలు అమ్ముకోవాలని సూచించిన ప్రధాని మోడీ వ్యాఖ్యలపై నిరసన తెలిపినందుకు గానూ ఓ విద్యార్థికి జేఎన్యూ అధికారులు రూ.20 వేలు జరిమానా విధించారు. ఢిల్లీలోని జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రాజస్తాన్కు చెందిన మనీశ్ కుమార్ మీనా ఎం.ఫిల్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా క్యాంపస్లోని సబర్మతీ బస్టాండ్ వద్ద తోటి విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీనిపై వర్సిటీకి చెందిన క్రమశిక్షణ అధికారులు.. మనీశ్, ఇతర విద్యార్థులపై విచారణ కమిషన్ వేశారు. క్యాంపస్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిబంధనలకు వ్యతిరేకమని చెబుతూ అతడికి జరిమానా విధించారు. ఈ నెల 21న అతడు తన పరిశోధనకు సంబంధించిన థీసెస్ను సమర్పించాల్సి ఉంది. కాగా, ఇప్పుడు వర్సిటీ అధికారులు మనీశ్పై జరిమానా విధించి, అతడిని హాస్టల్ నుంచి పంపించారు. వర్సిటీ నిర్ణయంపై మనీశ్ స్పందిస్తూ...'మోడీ చెప్పిన దానినే నేను ఆచరించాను. ఆయన మాట విన్నందుకు వర్సిటీ అధికారులు నన్ను హాస్టల్ నుంచి పంపించారు. నేను ఎక్కడికి వెళ్లాలి. నాలుగు రోజుల్లో నా పరిశోధన పత్రాలు సమర్పించాల్సి ఉంది. నా దగ్గర డబ్బుల్లేవు. జేఎన్యూ అధికారులు కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. యూనివర్సిటీలో నిరసన గళాలను అణచివేసే కుట్ర జరుగుతోంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేసినందుకు సుభాన్షు సింగ్ అనే స్కాలర్కు జేఎన్యూ అధికారులు రూ.40 వేలు ఫైన్ విధించారు. అంతేగాక తన థీసెస్లను కూడా ఆలస్యం చేశారు.