Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుస్తులు చింపి..దౌర్జన్యం
- జార్ఖండ్లో బీజేపీ యువమోర్చా అరాచకం
రాంచీ : సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80)పై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు అమాంతంగా దాడికి దిగారు. అగ్నివేశ్ తేరుకునేలోపు ఆయన దుస్తులను చింపేయడంతోపాటు, బౌతికదాడికి పాల్పడ్డారు. రాంచీకి సుమారు 365 కిలో మీటర్ల దూరంలోని పకూర ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అగ్నివేశ్ వెళ్ళారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు నిరసనలకు దిగారు.రోడ్డుపై బైటాయించారు. క్రిస్టియన్ మిషనరీలతో కలిసి అగ్నివేశ్ జార్ఖండ్లో గిరిజనులను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అగ్నివేశ్ హోటల్ నుంచి బయటకు రాగానే 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ ఆయన్ను చుట్టిముట్టి తీవ్రంగా కొట్టారు. బీఫ్పై ఆయన చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ చేయిచేసుకున్నారు. 'హింసకు నేను వ్యతిరేకిని.. శాంతిని ప్రేమించేవాడిని. అలాంటి నాపై వాళ్లు ఎందుకు దాడి చేశారో తెలియదు' అని స్వామి అగ్నివేశ్ వ్యాఖ్యానించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.