Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి: గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ సంబర్భంగా అసోంలో ధుబ్రి జిల్లాలోని ఓ పాఠశాలలో ఛాతిలోతు వరద నీటిలో కూడా జెండాకు వందనం పెడుతున్న ఇద్దరు బాలురు, ఇద్దరు ఉపాధ్యాయుల ఫొటో నెట్లో హల్చల్ చేసి భారతీయుల మనసులను గెలుచుకుంది. అయితే ఈ ఏడాది స్వాతంత్య్ర ఉత్సవాల సంబరాలపై నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్షిప్(ఎన్ఆర్సీ) తుది ముసాయిదా మాత్రం ధుబ్రి జిల్లాలోని బర్కాలియా నష్కోరా గ్రామంలో తన ప్రభావాన్ని చూపింది. ఆ ఫొటోలో ఛాతిలోతు నీటిలో జెండాకు వందనం చేస్తున్న తొమ్మిదేండ్ల బాలుడు హైదర్ ఖాన్ పేరు ఎన్ఆర్సీ తుది ముసాయిదాలో చోటు దక్కలేదు. దీంతో నేటి పంద్రాగస్టున ఆ బాలుడి కుటుంబంలో అనిశ్చితి నెలకొంది. హైదర్ సోదరి, సోదరుడి పేర్లు జాబితాలో నమోదయ్యాయి గాని హైదర్ పేరు మాత్రమే నమోదు కాలేదని బాలుడి తల్లి వాపోయింది. 'ఎన్ఆర్సీ గురించి నాకేం తెలీదు.. మా ప్రాంతంలో చదువుకున్న పెద్దలు చెప్పింది నేను చేస్తాన'ని నాలుగో తరగతి చదువుతున్న హైదర్ ముద్దుముద్దు మాటలతో చెప్పాడు. ఆ ఫొటో గురించి ప్రస్తావించగా.. 'అన్ని నీట మునిగిపోయాయి ఉన్నాయి. ఈదుకుంటూ జెండా దగ్గరకు వెళ్లేందుకు అందరు భయపడు తుండగా నేను, నా మిత్రుడు వెళ్లామ'ని గర్వంగా తెలిపాడు. మా వర్గానికి చెందినవారిని బంగ్లాదేశీ యులుగా కొందరు చిత్రిస్తున్నారని, కానీ తాము దేశభక్త భారతీయులమని హైదర్ ఇంటికి పొరుగున ఉండే కొలుముద్దీన్ అన్నారు.