Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్కు ఐరాస హెచ్చరిక
- ఆసియాలో ఆర్మీవర్మ్ చీడ తొలిసారి వెలుగులోకి..
న్యూఢిల్లీ: భారత్లో ఆహార పంటలకు ఇటీవల సోకిన ఆర్మీవర్మ్ తెగులుతో దేశ ఆహారభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం వున్నదని ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) హెచ్చరించింది. భారత్లో ఇటీవల వెలుగు చూసిన ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతున్నదని తెలిపింది. దీనితో ఆహార భద్రతకు మాత్రమే కాక ఆసియా దేశాలలోని చిన్న, సన్నకారు రైతుల జీవితాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఎఫ్ఎఓ తన హెచ్చరికలో పేర్కొంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ తెగులు ఆగేయాసియా, దక్షిణ చైనా దేశాలకు కూడా కూడా ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించింది. కర్నాట కలోని శివమొగ్గలో ఈ ఆర్మీవర్మ్ తెగులను గత మే నెలలో కనుగొన్నారు. ఈతెగులు ఆసియాలో వెలుగు చూడటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది వివిధ రాష్ట్రాలలోని 9వ్యవసాయాధారిత వాతా వరణ మండలాలకు సోకిందని ఎఫ్ఎఓ వర్గాలు వివరించాయి. ఈ తెగులును వ్యాప్తి చేసే సూక్ష్మజీవి రాత్రి సమయాలలో ఒకేరాత్రి దాదాపు 100 కి.మీ వరకూ ప్రయాణిస్తూ ఎడాది పొడవునా పంటలకు చేటు చేస్తుందని ఎఫ్ఎఓ తన ప్రకటనలో వివరించింది. ఈతెగులు వరి, జొన్న, కాయగూరలు, వేరుశనగ, పత్తి వంటి పంటలకు సోకే అవకాశం వున్నదని, ఆసియాలోని వరి, జొన్న ఉత్పత్తిదారులపై ఇది తీవ్ర ప్రభావాన్నే చూపుతుందని హెచ్చరించింది. 2016లో తొలిసారిగా అమెరికాలో వెలుగు చూసిన ఈ తెగులు ఆఫ్రికాకు విస్తరించింది. ఈ ఏడాది ఆరంభంలో ఉత్తరాఫ్రికాలోని అనేక దేశాల్లో ఈ తెగులు విస్తరించటంతో లక్షలాది హెక్టార్లలో జొన్న, ఇతర ఆహార పంటలు దెబ్బతిన్నాయి.