Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్లో చికిత్స
- వైద్యబృందం పర్యవేక్షణలో మాజీ ప్రధాని
- ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శ
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(93)ని ప్రధాని మోడీ బుధవారం సాయంత్రం పరామర్శించారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యవర్గాలు తెలిపాయి. వాజ్పేయి ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే ప్రధాని ఎయిమ్స్కు వచ్చారు. ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్లను మోడీ అడిగి తెలుసుకున్నారు. వాజ్పేయిని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా అంతకు ముందు పరామర్శించారు. మరోపక్క, ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు. ఈనెల 11న కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ అధ్యక్షుడు ఎయిమ్స్కు వచ్చి వాజ్పేయి ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. కిడ్నీ, మూత్ర సంబంధ సమస్యలు, వయో రుగ్మతల కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో రెండునెలల క్రితం ఆయన ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే.