Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 25నుంచి జన ఆరోగ్య అభియాన్
- పంద్రాగస్టున ఎర్రకోటపై ప్రధాని మోడీ సందేశం
- నాలుగేండ్ల విజయాలను వల్లెవేసిన బీజేపీ సర్కార్
న్యూఢిల్లీ: నిజాయితీగా పన్ను కడితే పుణ్యం వస్తుం దని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బుధ వారం 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని ఎర్ర కోటలో చేసిన ప్రసంగంలో పన్నులు నిజాయితీగా కడుతున్న వారిని మోడీ ప్రశంసిం చారు. ఇలా మంచి పనులు చేయడం వల్లపుణ్యం లభిస్తుందని అన్నారు. పన్నుల వల్ల వచ్చే డబ్బుతో ప్రభుత్వం పేద ప్రజల కోసం తమ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నదని, ఆ ఘనత పన్నులు కట్టేవారికే దక్కుతుందని అన్నారు. ఓ నిజాయితీ పరుడైన పౌరుడు చెల్లించే పన్నులతో మూడు పేద కుటుంబాలకు ఆహారం లభిస్తుందని, ఆ పుణ్యం పన్ను చెల్లించే వారికే వస్తుందని అన్నారు.
త్వరలోజరిగే సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ చివరి సారి జెండా ఎగురవేసి జాతికి 'ఎన్ని కల' సందేశాన్నిచ్చారు. తన ప్రసంగంలో నాలుగేం డ్ల ప్రగతి నివేదికను మాత్రమే కాక, తదు పరి ఎన్నికల్లో తాను మళ్లీ ఎన్నికైతే చేబట్టే కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చేసిన ఈ చివరి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ కొత్తపథకాలను కూడా ప్రకటించారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు రు.5లక్షల విలు వైన ఉచిత వైద్యం అంది స్తామంటూ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పేరిట ఆరోగ్య బీమా పథకా న్ని సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభించనున్నట్టు తెలి పారు. సైనిక దళాలలో పురుషులతో సమానంగా ప్రస్తుత షార్ట్ సర్వీస్ కమిషన్ మహిళా అధికారులకు కూడా పర్మినెంట్ కమిషన్హోదాను కల్పిస్తామ న్నారు. మొత్తం 83 నిమిషాలు ప్రసంగించిన ప్రధాని మోడీ తన ప్రభుత్వ విజయాలను '2013 నాటి పరిస్థితి'తో పదే పదే పోల్చుతూ ప్రసంగిం చటం విశేషం. ప్రధాని ప్రసంగం కేవలం తన ప్రభు త్వ విజయాల నివేదికగా మాత్రమే కాక వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తిరిగి ఎన్నికైతే భావి ప్రాధాన్యతలను కూడా వివరించే ప్రయత్నం చేశారు. 2022లో భారత్ తొలి మానవసహిత రోదసీ యాత్రను ప్రారంభిస్తుందని ఆయన ప్రకటించారు. ఈప్రకటన సాకారమైతే వ్యోమగాములను రోదసిలోకి పం పిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ స్థానాన్ని దక్కించుకుంటుంది. తన ప్రసంగంలో మహిళలు, పేదల స్థితిగతులను సుదీర్ఘంగా ప్రస్తావించిన ప్రధాని మహిళలపై హింస నానాటికీ పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై హింసకు పాల్పడిన కేసుల్లో దోషులుగా తేలిన వారికి పలు సందర్బాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మరణశిక్ష విధించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని తన ప్రసంగంలో ఈ ప్రస్తావన చేసినపుడు ప్రజల నుండి పెద్దయెత్తున కరతాళ ధ్వనులు వెలువడ్డాయి. ప్రస్తుతం సైన్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారులుగా వున్న మహిళలకు పారదర్శకమైన తీరులో పర్మినెంట్ కమిషన్ హోదాను కల్పిస్తామన్నారు. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన మంత్రివర్గాలలో మహిళలకు అత్యధికంగా ప్రాతి నిధ్యం కల్పించింది తన మంత్రివర్గమేనని తాను సగర్వంగా చెబుతున్నానన్నారు. ముస్లింలు అనుసరించే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆయన ప్రస్తావి స్తూ తమప్రభుత్వ హయాంలోనే ఈబిల్లుకు ఆమోదముద్ర పొందేలా ప్రయత్నిస్తామని తాను ముస్లిం సోదరీమణులకు వాగ్దానం చేస్తున్నానన్నారు. మౌలిక వసతుల రంగంలో త మ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు అత్యవసరమైన విద్యుత్, గృహనిర్మాణం, గ్రామాలు, చిన్న పట్టణాలలో మరుగుదొడ్ల వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిస్తు న్నామన్నారు. గత యూపీఏ ప్రభు త్వాన్ని టార్గెట్ చేసిన మోడీ తమ ప్రభుత్వ విజయాలను 2013కుముందు నాటి పరిస్థితులతో పోల్చుకుని చూడాలని ప్రజలకు సూచించారు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో జమ్మూకాశ్మీర్ అంశానికి ప్రాధాన్యతనిచ్చినమోడీ ఈఏడాది తన ప్రసంగంలో కాశ్మీర్పై చర్చలకు, ఏకాభిప్రా యానికి స్థానం కల్పించారు. జమ్మూ కాశ్మీర్లో పంచాయితీ ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను 'సమతుల్యంగా అభివృద్ధి' చేస్తామని చెప్పారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి కవితను ఆయన ప్రస్తావిస్తూ భారత్ అంతర్జాతీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతోందన్నారు. అన్నిరకాల బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందే మార్గాన్ని భారత్ ప్రపంచానికి చూపుతుందని ఆయ న చెప్పారు. భారతీయపాస్పోర్టు మరింత బలోపేతమయిం దని, విదేశాలలో భారతీయులు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నా భారత ప్రభుత్వం వారిని ఆదుకుని అండగా నిలుస్తుందన్నారు. దేశాన్ని నవయుగం వైపు నడిపించేం దుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.