Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
గువహటి : ఆవులను దొంగలిస్తున్నారనే అనుమానంతో అస్సాంలో జరిగిన మూక దాడిలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నంబర్ప్లేట్ లేని ఆటోలో రెండు ఆవులను తీసుకుని వెళ్తుండటమే వీరు చేసిన నేరంగా మారింది. ఆవులను దొంగిలిస్తున్నానే అనుమానంతో వీరిపై కొంతమంది గ్రామస్తులు దాడికి దిగారు. సూటీ పోలీస్స్టేషన్ పరిధిలోని డిపోంగ టీ ఎస్టేట్కు సమీపంలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. మృతి చెందిన వ్యక్తిని డెబెన్ రాజ్బోంగ్షి (35)గా గుర్తించారు. గాయపడ్డవారిని పుజన్ ఘతోవర్ (40), ఫుల్ చాంద్ సాహు (25), బిజోయో నాjక్ (25)గా పోలీసులు గుర్తించారు. వీరంతా కూడా సమీపంలోని గెరెకి గ్రామానికి చెందిన వారని, పం దుల వ్యాపారస్తులు అని పోలీసులు తెలిపారు.
పైన పేర్కొన్న నలుగురు నంబర్ప్లేట్ లేని ఆటోలో ప్రయాణిస్తుండటం చూసి గ్రామస్తులు ఆవు దొంగలనే అనుమానంతో దారుణంగా దాడికి దిగారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలికి చేరుకునే సరికే నలుగురిని తీవ్రంగా కొట్టారు. పోలీ సులు వారిని రక్షించి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. నలుగురిలో ఒకరు మృతి చెందగా, మిగిలిన ముగ్గురూ విశ్వనాథ్ చారియాలిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సంఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేయడం విశేషం. బాధితులు నలుగురిపై కూడా ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని కేసు నమోదు చేశారు. వీరిని కొట్టిన ప్రజలపై మరొక కేసు నమోదు చేశారు. కానీ ఎప్పటి వరకూ ఎవ్వరినీ అరెస్టు చేయలేదు.
కాగా, అస్సాంలో ఇటీవల మూక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. జూన్ 8న చిన్నారులను ఎత్తుకెళ్లేవారిని ఆరోపిస్తూ కార్బిలో జలపాతాలు చూడడానికి వచ్చిన ఇద్దరు స్నేహితులను దారుణంగా హతమార్చారు. 10 రోజుల తరువాత గోల్పారా జిల్లాలోనూ ఒక జంటపై దాడికి దిగారు. అలాగే జులై 1న సోనిత్పూర్లో ఒక మతిస్థిమితం లేని మహిళను చిన్న పిల్లలను అపహరించేదానిగా భావిస్తూ ఒక స్తంభానికి కట్టి దారుణంగా దాడికి దిగారు.