Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం పేర్ల మీద ఉన్న సంస్థలన్నింటినీ హైందవీకరిస్తున్న ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా మరో వివాదానికి తెరతీసింది. ఇప్పటికే దేశంలోని అతి పురాతనమైన మొగల్సరారు జంక్షన్ను దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్గా మార్చిన యోగి సర్కారు.. తాజాగా రాష్ట్రంలోని మూడు విమానాశ్రాయాల పేర్లను మార్చాలని నిర్ణయించింది. రారుబరేలి, కాన్పూర్, ఆగ్రాలో ఉన్న రక్షణ శాఖ విమానాశ్రాయాల పేర్లను మార్చనుంది. బరేలి విమానాశ్రాయాన్ని నాథ్నగరిగా (పౌరాణికాల్లో బరేలి పేరు), కాన్పూర్లోని చకేరి ఎయిర్పోర్ట్కు గణేష్ శంకర్ విద్యార్థి పేరు, ఆగ్రా విమానాశ్రాయాన్ని దీన్ దయాల్ ఉపాధ్యాయగా మార్చాలని ప్రతిపాదించారు. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని.. త్వరలోనే కేంద్ర విమానయాన శాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని యూపీ మంత్రి నంద్గోపాల్ నంది తెలిపారు.