Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం: వైసీపీ అధినేత వైఎస్.జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 238వ రోజు గురువారం విశాఖ జిల్లా, నాతవరం మండలం డి.ఎర్రవరం గ్రామం నుంచి బెన్నవరం వరకూ సాగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 45 నిమిషాల పాటు సాగింది. అనంతరం ఆయన హైదరాబాద్ పయనమయ్యారు. పాదయాత్ర సందర్భంగా ములగపూడిలో రోడ్డుపై మహిళలు చీరలు వేయగా వాటిపై జగన్ నడిచారు. ఈ సందర్భంగా డొంకాడలో కొండపోరంబోకు భూములకు పట్టాలివ్వలేదని ఆ గ్రామ మహిళలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. తనకు పింఛను ఇవ్వడం లేదని మర్రిపాలెం గ్రామానికి కిడ్నీ బాధితుడు పడాల రాంబాబు, రుణాలివ్వడం లేదని ములగపూడికి చెందిన ఎస్సీ సామాజిక తరగతి మహిళలు జగన్కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని చెప్పారు.. జగన్ పాదయాత్ర తిరిగి శనివారం ఉదయం ప్రారంభం కానుంది.